న్యూఢిల్లీ, మే 3: కరోనా అంతం కోసం అన్ని దేశాలు తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా తయారీ సాంకేతికతను ప్రపంచంతో పంచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. మహమ్మారిపై పోరులో టీకా జాతీయవాదానికి చోటు లేదని అన్నారు. సోమవారం ఆమె ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) వార్షిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు.