న్యూఢిల్లీ, జూలై 27: గత ఏడాది మార్చి తర్వాత కరోనాతో గానీ ఇతర కారణాలతో గానీ అనాథలైన లేక తలిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలను గుర్తించడంలో ఇంకా జాప్యం జరుగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనాథలైన పిల్లల గుర్తింపు ఎంతవరకు వచ్చిందో తెలియజేస్తూ నివేదికలు ఇవ్వాలని రాష్ర్టాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇప్పటివరకు గుర్తించిన అనాథ పిల్లల సంఖ్య, వారికి అందజేసిన సహాయం తదితరల వివరాలను నివేదికల్లో పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఆపత్కాలంలో అనాథలైన పిల్లల చదువు ఆగకుండా చూడాలని రాష్ర్టాలను ఆదేశించింది.