వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరిగింది. విశ్వక్షేణ పూజలో మొదలై ఆగమ శాస్త్ర ప్రకారం సంప్రదాయ పద్దతిలో కల్యాణ తంతును ఆలయ అర్చకులు నిర్వహించారు. రాజన్న ఆలయం తరపున ఈవో కృష్ణప్రసాద్ ,మున్సిపల్ తరపున చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, రాజు, కమీషనర్ శ్యామ్ సుందర్లు స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఎదురెక్కిన గోదారి.. పరవళ్లు తొక్కిన మానేరు