డొమినికా: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సికి డొమినికన్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. డొమినికాలో అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలతో కొద్దిరోజులుగా చోక్సి అక్కడ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా ఆయనకు బెయిల్ ఇవ్వడంతో పాటు ఆంటిగ్వా, బార్బుడాకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది.