న్యూఢిల్లీ, జూలై 31: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి చెందిన ఏడు జాగిలాలు రిటైర్ అయ్యాయి. అవి దాదాపు పదేండ్ల పాటు సేవలందించాయి. వాటికి సీఐఎస్ఎఫ్ అధికారులు వీడ్కోలు పలికారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్లో భాగంగా ఢిల్లీ మెట్రో భద్రతకు వాటిని నియమించారు. రిటైరైన జాగిలాలను ‘ఫ్రెండికోస్’ అనే సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ వాటి బాగోగులను చూస్తుంది. వాటిని పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఆ సంస్థ ద్వారా దత్తత తీసుకోవచ్చని సీఐఎస్ఎఫ్ డీఐజీ జితేందర్ రాణా తెలిపారు.