తూప్రాన్ రూరల్, మార్చి 30 : ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ అభిమతం అని, నిరుపేదలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం తూప్రాన్లో పట్టణం, మండల పరిధిలోని 98 మంది లబ్ధిదారులకు రూ.98,11, 368 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన ఆరేండ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా తూప్రాన్ మండలంలోని 840 కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. రైతులు పండిస్తున్న పంటలపై కేంద్రం ఆంక్షలు విధించిన్నప్పటికీ యాసంగిలో పండించిన వరి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడం శుభపరిణామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీటిని అందిస్తాం..
వారం రోజుల్లో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టుల నుంచి సాగునీటిని హల్దీవాగులోకి తరలించి తూప్రాన్, వెల్దూర్తి, శివ్వంపేట మండలాల్లోని చెరువులను నింపుతామని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని కాల్వల ద్వారా తూప్రాన్ మండలం మీదుగా సింగూర్ ప్రాజెక్టుకు తరలిస్తామన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరగడంతోపాటు చెరువులు, కుంటల కింద పంటలకు పుష్కలంగా సాగునీరు లభిస్తుందన్నారు. తూప్రాన్ మండలం నుంచి సింగూర్ వరకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్, ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌ డ్, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఆర్డీవో శ్యాం ప్రకాశ్, తహసీల్దార్ శ్రీదేవి, టీఆర్ఎస్ తూప్రాన్ మండలాధ్యక్షుడు బాబుల్రెడ్డి, ఎంపీపీ స్వప్న, పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ:మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
చేగుంట, మార్చి 30 : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన చేగుంటలోని సాయిబాలాజీ గార్డెన్లో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేయలేకపోయాయని, ప్రజల అవసరాలకు గుర్తించి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. తెలంగాణలో ప్రతి పల్లె పచ్చదనంతో ఉం డాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. హరితహారంలో నాటి ప్రతి మొక్కను కాపాడుకునేందుకు ట్యాం కర్ల ద్వారా నీరు పోస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకావ్, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్కుమార్, వైస్ ఎంపీపీ మున్నూర్ రాంచంద్రం, చేగుంట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఎంపీడీవో ఉ మాదేవి, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, మం డల రైతుబంధు అధ్యక్షుడు జింక శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
నార్సింగిలో చెక్కుల అందజేత..
నార్సింగి మండల పరిషత్ కార్యాలయంలో నార్సిం గి, నర్సంపల్లి, వల్లూర్ గ్రామాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు కల్యాణ్యలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్రావుతో కలిసి అందజేశారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో ఆనంద్మేరీ, నార్సింగి ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం అశోక్, వైస్ ఎంపీపీ సుజాత, ఎంపీటీసీ సత్యనారాయణ, మండల రైతుబంధు అధ్యక్షుడు లింగారెడ్డి, మా ర్కెట్ కమి టీ చైర్మన్ రజనక్ ప్రవీణ్కుమార్, వైస్ చైర్మన్ రా జేందర్రెడ్డి, సొసైటీ చైర్మన్ శంకర్గౌడ్, సర్పంచ్లు ఆనందాస్మహేశ్వరి, బొమ్మగారి భారతి, పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
సాగర్ ఉప ఎన్నిక : వామపక్షాల మద్దతు కోరిన కాంగ్రెస్
సాగర్ నియోజకవర్గానికి జానారెడ్డి చేసిందేమీ లేదు