హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో బ్యాంకుల పని వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ర్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై బ్యాంకుల పని వేళలపై సమీక్షించింది. లాక్డౌన్ సమయం సడలింపుతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకుల సేవలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. మారిన బ్యాంకు వేళలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్గదర్శకాలు జూన్ 9 వరకు అమల్లో ఉండనున్నాయి.