న్యూఢిల్లీ, మే 31: అల్లోపతి వైద్యం, వైద్యులపై యోగా గురువు రాందేవ్ బాబా ఇటీవల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం బ్లాక్ డేగా పాటిస్తామని ఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ వైద్యుల అసోసియేషన్ ప్రకటించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై, ప్రజారోగ్య సేవల సిబ్బందిపై ప్రజల్లో అలజడి రేపేందుకు రాందేవ్ ప్రయత్నిస్తున్నారని, ఆయనపై అంటువ్యాధుల చట్టం- 1897 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. గుజరాత్కు చెందిన వైద్యుల సంఘం కూడా రాందేవ్పై కేసు నమోదు చేయాలంటూ అహ్మదాబాద్ పోలీసులను కోరింది.