హరిద్వార్ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రతాపం చూపుతోంది. ఉత్తరాఖండ్ లోని రిషీకేష్ ఎయిమ్స్ లో 110 మంది వైద్యులు, వైద్య సిబ్బందికి కొవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరందరికీ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని ఎయిమ్స్ పీఆర్ఓ హరీష్ తప్లియాల్ పేర్కొన్నారు.
కొవిడ్-19 రోగులతో ఎక్కువ కాలం డైరెక్ట్ కాంటాక్ట్ కలిగిఉండటంతోరు వ్యాక్సిన్ తీసుకున్నా వీరందరికీ కరోనా వైరస్ సోకిఉంటుందని భావిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. రిషీకేష్ లోని కొవిడ్ దవాఖానా ముఖ్య వైద్యాధికారి విజయేష్ భరద్వాజ్ కు కూడా కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపారు.