న్యూఢిల్లీ: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ను శనివారం పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల ఆరంభంలో ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో యువ రెజ్లర్ హత్య జరుగగా.. దాంతో సంబంధం ఉందని భావిస్తున్న సుశీల్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. దీంతో ఢిల్లీ పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసు జారీ చేయగా, కోర్టు ముందస్తు బెయిల్ను రద్దు చేసింది. మరోవైపు సుశీల్ ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల ఇస్తామని పోలీసులు ప్రకటించారు. సుశీల్ను అదుపులోకి తీసుకున్న పంజాబ్ పోలీసులు అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించినట్లు కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి.