న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: కరోనా రోగుల చికిత్సకు ఐవర్మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్సీక్యూ) ఔషధాలను వినియోగించవద్దని కొవిడ్-19పై ఏర్పాటు చేసిన జాతీయ కార్యదళం, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలతో కూడిన సంయుక్త బృందం సూచించింది. ఈ మేరకు చికిత్స జాబితా నుంచి వాటిని తొలగించింది. అలాగే కరోనా రోగుల చికిత్సకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.