న్యూఢిల్లీ: జడ్జిలు మౌఖిక ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడీషియల్ రికార్డులో భాగం కాని మౌఖిక ఆదేశాలను జారీ చేయడాన్ని మానుకోవాలని స్పష్టం చేసింది. ఏం చెప్పాలన్నా తీర్పులు, ఆదేశాలు ద్వారానే చెప్పాలని నిర్దేశించింది. మౌఖిక ఆదేశాలు ప్రమాదకరమని, ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. వాటి వల్ల న్యాయవ్యవస్థ జవాబుదారీతనాన్ని కోల్పోతుందని పేర్కొంది.