న్యూఢిల్లీ: కొవిడ్ ఔషధాలు, వ్యాక్సిన్లు, వైద్య పరిరకాలపై జీఎస్టీ తగ్గింపు అంశంపై జీఎస్టీ మండలిలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే శుక్రవారం కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది.
కొవిడ్-19 చికిత్సకు సంబంధించిన టీకాలు, ఔషధాలు, పరికరాలపై విధిస్తున్న పన్ను విషయమై కౌన్సిల్ భేటీలో సుదీర్ఘంగా చర్చించామని సీతారామన్ వెల్లడించారు. జీఎస్టీ కౌన్సిల్ ముగిసిన తర్వాత మీడియాతో ఆమె మాట్లాడారు.
కొవిడ్ సంబంధిత వస్తువులపై జీఎస్టీ తగ్గింపు విషయమై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉపసంఘం 10 రోజుల్లో నివేదిక ఇస్తుందని తెలిపారు. వచ్చేనెల 8లోపు నివేదిక సమర్పిస్తుందన్నారు. ఉపసంఘం సభ్యులను ఇంకా ఖరారు చేయలేదు.
విరాళంగా వచ్చిన వైద్య పరిరకాలపై మాత్రం జీఎస్టీ మినహాయింపు కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వం లేదా ఏజెన్సీలకు వచ్చే వైద్య పరికరాలపై మినహాయింపును ఈ ఏడాది ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని తెలిపారు.
కేంద్రం, రాష్ట్రాలు కొనుగోలు చేసే టీకాలు, ఇతర వైద్య పరికరాలపై చెల్లించే జీఎస్టీ వెనక్కు తిరిగి వస్తుందని చెప్పారు. స్వీయ ధ్రువీకరణకు వీలుగా సీ-జీఎస్టీ చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించినట్లు ఆమె తెలిపారు.
విరాళంగా వచ్చిన వైద్య పరిరకాలపై మాత్రం జీఎస్టీ మినహాయింపు కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వం లేదా ఏజెన్సీలకు వచ్చే వైద్య పరికరాలపై మినహాయింపును ఈ ఏడాది ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని తెలిపారు.
మినహాయింపు జాబితాలో బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిస్-బీ ఔషధాన్ని చేర్చినట్లు వివరించారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి కోసం జపాన్, యూఏఈని భాగస్వాములను చేశామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత తొలిసారి జీఎస్టీ భేటీ జరిగింది.
టాటా గ్రూప్ చేతికి ఆన్లైన్ సరుకుల బిగ్ బాస్కెట్
సరికొత్త రికార్డు తాకిన నిఫ్టీ…
పేటీఎం భారీ ఐపీవో రూ.21,800 కోట్ల సమీకరణ
ఎన్ఐఏ అదుపులో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది
రాబర్ట్ వాద్రాకు ఊరట : ఐటీ నోటీసులపై బదులిచ్చేందుకు మరో మూడు వారాల గడువు
31 కోట్లతో డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న బిగ్ బీ
ఆయన ఓ ఫైవ్ స్టార్ పొలిటీషియన్ : బీజేపీ
2డీజీ డ్రగ్ సాచెట్ ఖరీదు రూ 990
జాతీయ జెండాను కేజ్రీవాల్ అవమానించారు : కేంద్రమంత్రి
corona helpline : కరోనా బాధితుల కోసం హెల్ప్లైన్ నంబర్లు ఇవే..