చెన్నై: తమిళనాడు సీఎం పళనిస్వామిపై డీఎంకే నేత ఏ రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణలు చెప్పారు. ఇటీవల చెపాక్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. సీఎం పళనిస్వామిపై ఏ రాజా అనుచిత కామెంట్స్ చేశారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ను ముఖ్యమంత్రితో పోలుస్తూ.. సహేతుకమైన బంధంలో ఉన్న దంపతులకు స్టాలిన్ పుట్టారని, అది కూడా నార్మల్ డెవలరీ ద్వారా స్టాలిన్ జననం జరిగినట్లు చెప్పిన రాజా.. సీఎం పళనిస్వామి ఓ అక్రమ సంబంధ జంటకు పుట్టారని, అది కూడా ప్రిమాచ్యూర్గా జన్మించారన్ని ఆరోపించారు. ఇక సీఎం పళనిస్వామికి ఢిల్లీకి చెందిన డాక్టర్ మోదీ నుంచి హెల్త్ సర్టిఫికేట్ తీసుకున్నట్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ ప్రచార సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన సీఎం పళనిస్వామి.. దేవుడే వారికి శిక్ష వేస్తాడని అన్నారు. ఎవరైనా తల్లి గురించి అంత పబ్లిక్గా కామెంట్స్ చేస్తారా.. అంటే వారి పరిపాలన ఎలా ఉంటుందో చూడండి, దేవుడే వారిని శిక్షిస్తారని పళని భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం పళనిస్వామితో పాటు ఆయన తల్లిపై అనుచిత కామెంట్స్ చేసినందుకు ఏ రాజా క్షమాపణలు చెప్పారు.