చెన్నై: డీఎంకే సీనియర్ నాయకుడు, ఎంపీ ఏ రాజా సతీమణి క్యాన్సర్తో మరణించారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె నిన్న రాత్రి మృతిచెందారు. క్యాన్సర్ బారినపడిన పరమేశ్వరి చెన్నైలోని డా.రేలా ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్లో ఆరు నెలలుగా చికిత్స పొందుతున్నారు.