చెన్నై: ఒక వ్యాపారవేత్తను ఎమ్మెల్యే బెదిరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై కేసు నమోదైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. తాంబరంలోని మరైమలై నగర్లో ఉన్న డేజంగ్ మోపార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయానికి స్థానిక డీఎంకే ఎమ్మెల్యే ఎస్ఆర్ రాజా వెళ్లారు. గతంలో ఆర్కే శర్మ అనే వ్యక్తిపై ఆ కంపెనీ యాజమాన్యం చీటింగ్ కేసు నమోదు చేసింది. దీంతో ఆయనకు మద్దతుగా ఆ ఎమ్మెల్యే అక్కడకు వెళ్లారు. ఆ కంపెనీ సీఈవో కృష్ణమూర్తిని బూతులు తిట్టడంతోపాటు బెదిరించారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ సీఈవో కృష్ణమూర్తి ఫిర్యాదుపై తాంబరం పోలీసులు స్పందించారు. అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎస్ఆర్ రాజాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, బీజేపీ రాష్ట్ర చీఫ్ కే అన్నామలై కూడా ఈ సంఘటనపై స్పందించారు. డీఎంకే పాలనలో నిబంధనలు, శాంతిభద్రతలను స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కంపెనీ సీఈవోపై ఎమ్మెల్యే ఎస్ఆర్ రాజా ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఆయనను తిట్టి, బెదిరించిన వీడియోను ట్వీట్ చేశారు.
In the Dravidian Model Aatchi of @arivalayam , I wonder which is a bigger threat to people – L&O breakdown during DMK rule or L&O breakdown DUE to the DMK rule?
(Seen in the video: DMK MLA SR Raja threatening and verbally abusing employees of a factory in Maraimalai Nagar) pic.twitter.com/8tZZg4s3Tr
— K.Annamalai (@annamalai_k) September 21, 2022