చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షియోమీ భారత్లో ఏప్రిల్ 8వ తేదీ నుంచి Mi ఫ్యాన్ ఫెస్టివల్ 2021 సేల్ను నిర్వహించనుంది. ఆరు రోజుల పాటు జరిగే సేల్ ఏప్రిల్ 13తో ముగియనుంది. ఆన్లైన్ సేల్ సమయంలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిడ్ కార్డులపై ఆఫర్లను అందిస్తున్నది. Mi హోమ్ ఆఫ్లైన్ స్టోర్లలో విక్రయాలు ఇప్పటికే ప్రారంభం కాగా, మే 17తో ముగుస్తుంది. ఆఫ్లైన్ కొనుగోలుదారుల కోసం కంపెనీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆన్లైన్ కస్టమర్ల కోసం షియోమీ ప్రతి రోజు ఫ్లాష్ సేల్స్ నిర్వహిస్తుంది. కంపెనీకి చెందిన స్మార్ట్ఫోన్లు, స్మార్ట్టీవీలు, ల్యాప్టాప్లు, తదితర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తుంది.