మదురై: తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు మహిళలపట్ల గౌరవభావం లేదని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. శుక్రవారం మదురైలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన ప్రధాని.. నారీశక్తి ప్రాధాన్యం గురించి మదురై ఎన్నో పాటలు చెప్పిందని పేర్కొన్నారు. మహిళలను ఏవిధంగా గౌరవించాలో, ఏవిధంగా ఆరాధించాలో ఇక్కడ చూడవచ్చన్నారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మహిళలను గౌరవించడంగానీ, భద్రత కల్పించడంగానీ చేయలేవని ఆయన విమర్శించారు. డీఎంకే నేతలు పదేపదే మహిళలను కించపరుస్తుంటారని ఆరోపించారు.
మదురై ప్రజలు తెలివైనవారని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని, రాజకీయ పార్టీల గుణగణాలను గుర్తించి అభివృద్ధికి భరోసా ఇస్తున్న ఎన్డీయే కూటమికే ఓటు వేస్తారని ప్రధాని వ్యాఖ్యానించారు. టెక్స్టైల్ రంగంలో మరింత యాంత్రీకరణ, రుణ సౌలభ్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఏడాది బడ్జెట్లో మెగా-ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్ పథకం ‘MITRA’ను ప్రకటించామని చెప్పారు. రాబోయే మూడేళ్లలో ఏడు టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నేను కరుణానిధి బిడ్డను.. బీజేపీ బెదిరింపులకు భయపడను: స్టాలిన్
బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్న ఆ హైదరాబాదీని తిరస్కరించండి: మమతాబెనర్జి
ఆస్ట్రాజెనికా టీకా అవసరంరాదేమో : అమెరికా
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. కేజీ రూ. లక్ష
ఊర్వశి వాట్సాప్ బ్లాక్.. ఇశా నేగితో రిషబ్ డేటింగ్ !
బైడెన్ ప్రసంగంలో హోలీ ప్రస్తావన
డొనాల్డ్ ట్రంప్లా మమత తీరు: బీజేపీ
కొవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ తమిళిసై
రాబర్ట్ వాద్రాకు కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్లో ప్రియాంక దంపతులు