చెన్నై : డీఎంకే అధినేత స్టాలిన్ అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో స్టాలిన్ను తమ శాసనసభ పక్షనేతగా ఎన్నుకోనున్నట్లు తెలిసింది.
రేపు సాయంత్రం 6 గంటలకు అరివాలయం కలైగ్నార్ అరంగంలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుందని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ తెలిపారు.
పార్టీ తరఫున నూతనంగా ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే సమావేశానికి తప్పక హాజరుకావాలని పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే సూచించారు.
తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్న స్టాలిన్ సమర్థవంతంగా పార్టీని నడిపించి ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చారు.
ఈ నెల 7న ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనుండటంతో పార్టీ శ్రేణుల్లో ఆనంద వ్యక్తమవుతున్నది. 234 స్థానాలున్నతమిళనాడు శాసనసభకు గత నెల 6న ఎన్నికలు జరిగాయి.
ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడగా డీఎంకే 133 స్థానాల్లో జయకేతనం ఎగురువేసి అధికారాన్ని కైవశం చేసుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.