అమరావతి : రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. రైళ్లలో భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, దృశ్యాలు అవాస్తవమని ఆయన తెలిపారు.
శుక్రవారం జీఎం గజానన్ మాల్యా మీడియా సమావేశంలో మాట్లాడారు. గతేడాది కరోనా కారణంగా కొంతకాలం రైల్వే సేవలు నిలిచిపోయాయని ఆయన గుర్తు చేశారు.
కరోనా ప్రభావం తగ్గాక దశల వారీగా రైల్వే సేవలను పునరుద్ధరించామని వెల్లడించారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగిందని కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రాచారం చేస్తున్నారని, ప్రయాణికులు అపోహలు నమ్మవద్దని కోరారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్భయంగా ప్రయాణించొద్దని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి