వట్పల్లి/కంది/సంగారెడ్డి, మే 20 : నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్ర సంగారెడ్డి కొత్త బస్టాండ్, పోతిరెడ్డిపల్లి చౌరస్తాల్లో లాక్డౌన్ను పరిశీలించారు. సడలింపు సమయం దాటిన తర్వాత తిరుగుతున్న వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆటం కం లేకుండా ఆక్సిజన్ సరఫరాకు భద్రత కల్పిస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపు తర్వాత బయట తిరిగే వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ బాలాజీ, పట్టణ, రూరల్ ఇన్స్పెక్టర్లు రమేశ్, శివలింగం, ఎస్సైలు లక్ష్మారెడ్డి, సుభాశ్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
కొనసాగుతున్న లాక్డౌన్
లాక్డౌన్కు ప్రజలు సహరించాలని పోలీసులు కోరుతున్నారు. గురువారం సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ ఆధ్వర్యంలో ఉదయం 10 తర్వాత తిరుగుతున్న వాహనదారులపై కేసులు నమో దు చేశారు. సంగారెడ్డి పట్టణంలో ఇన్స్పెక్టర్ రమేశ్, రూరల్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ శివలింగం, సదాశివపేటలో ఇన్స్పెక్టర్ సంతోశ్ కుమార్, కొండాపూర్ ఇన్స్పెక్టర్ లక్ష్మారెడ్డి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో లాక్డౌన్ను పక్కగా అమలు చేస్తున్నారు. సదాశివపేట పట్టణంలో ఇన్స్పెక్టర్ సంతోశ్కుమార్, ఎస్సైలు రవి, ప్రశాం త్ లాక్డౌన్ను పర్యవేక్షించారు. కొండాపూర్ మండలంలోని గ్రామాల్లో ప్రజలు గూమికూడదని, సడలింపు సమయం దాటిన తర్వాత ఇండ్లలోనే ఉండాలని ప్రజలకు ఇన్స్పెక్టర్ లక్ష్మారెడ్డి, ఎస్సై సంతోశ్కుమార్ అవగాహన కల్పిస్తున్నారు. కంది మండలంలో ఇంద్రకరణ్ ఎస్సై రాజేశ్ నాయక్ ఆధ్వర్యంలో లాక్డౌన్ను పర్యవేక్షించారు.
పోలీసుల కోసం మరొక్కరు..
లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం రోజుకు 20 గంటల పాటు పోలీసులు చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు రాకేశ్ ఠాకూర్ సింగ్ తన వంతుగా రోజు మధ్యాహ్నం పోలీసు సిబ్బంది కోసం మజ్జిగను అందిస్తున్నాడు. సాయంత్రం సమయంలో ఆకలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీ, స్నాక్స్ను రాజేందర్, రవిశంకర్, అశ్వంత్ అందజేస్తున్నారు.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి
లాక్డౌన్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని వట్పల్లి ఎస్సై అన్నారు. వట్పల్లి పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. వాహనదారులు 10 గంటల తర్వాత రోడ్లపై కనిపిస్తే జరిమానా విధించడంతో పాటు సీజ్ చేస్తామన్నారు.
కరోనా బాధితులకు సహాయం
కరోనా బాధితులకు ప్రతిఒక్కరూ తమవంతు సహాయం చేయాలని సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు పి.సంగమేశ్వర్పాటిల్ అన్నారు. గురువారం మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో కరోనా బాధితులకు సన్న బ్యియం, కోడిగుడ్లు, సరిపడా పప్పులు, మాస్క్లు, శానిటైజర్లు, సబ్బులు తదితర వస్తువులను పంపిణీ చేశారు. 8074686471కు ఫోన్ చేస్తే ఇంటి వద్దకు వెళ్లి తోచిన సాయం చేస్తానన్నారు.