భోపాల్ : గుజరాత్లో క్యాబినెట్ పునర్వ్యవస్ధీకరణ పట్ల కాషాయ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా ప్రక్షాళన ఎప్పుడు చేపడతారని బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ దిగ్విజయ్ శుక్రవారం ట్వీట్ చేశారు.
“మోదీ, షా ద్వయం గుజరాత్లో మంచి ప్రయోగం చేశారు..ఎన్నికల్లోగా ముందు బాగా దండుకునేందుకు మంత్రులకు అవకాశం ఇవ్వండి..ఎన్నికలకు ముందు కొత్త ముఖాలను తీసుకువచ్చి అంతా సజావుగా ఉందనే సంకేతం పంపండ ” ని దిగ్విజయ్ కాషాయ పార్టీకి చురకలు వేశారు. ఇంతకీ మధ్యప్రదేశ్, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో క్యాబినెట్ ప్రక్షాళన ఎప్పుడు చేపడుతున్నారని ప్రశ్నించారు. కాగా గుజరాత్లో పాలక బీజేపీ భూపేంద్ర పటేల్ సర్కార్ క్యాబినెట్లో అన్నీ కొత్త ముఖాలను ఎంపిక చేసి మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేసింది.