మహబూబ్ నగర్: వారం రోజుల్లో జడ్చర్ల- మహబూబ్ నగర్ రహదారికి ఇరుపక్కల మొక్కలు నాటడం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు. గురువారం జడ్చర్ల నుంచి నక్కలబండ తాండ వరకు రహదారికి ఇరుపక్కల మొక్కలు నాటే విషయమై మున్సిపల్, అటవీ, ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు.
జడ్చర్ల- మహబూబ్ నగర్ రహదారిలో నక్కలబండ తండా వరకు రెండు వైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటాలని , వారంరోజుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఈ విషయమై తక్షణమే పనులు ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ సునీతకు ఆదేశాలు జారీ చేశారు. రహదారికి ఇరువైపులా నాటడంలో భాగంగా పెద్ద మొక్కలను తెప్పించి నాటాలని ఆదేశించారు. ఇందుకుగాను తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు.