మహబూబ్నగర్, మార్చి 18 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో పాలమూరుకు భారీగా నిధులు కేటాయించారు. పాలమూరు-రంగారెడ్డికి పెద్ద ఎత్తున నిధులు ప్రవేశపెట్టారు. ఇతర రన్నింగ్ ప్రాజెక్టుల కూ నిధుల కేటాయింపు కొనసాగింది. మరోవైపు సంక్షేమ రంగానికీ పెద్ద పీట వేసింది. పల్లెప్రగతి స్ఫూర్తి కొనసాగించేందుకు నిధుల కేటాయింపు ఎంతో ఉపయోగపడనుంది. అన్ని వర్గాలకూ సమన్యాయం చేశారు. కరోనా సమయంలోనూ సంక్షేమంపై ప్రభత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతు రాజ్యంగా భాసిల్లేందుకు వ్యవసాయానికి సైతం భారీగా నిధులు కేటాయించారు. విద్య, వైద్యం, మౌలిక వసతులు.. ఇలా ఏ రంగానికీ తక్కువ చే యకుండా కేటాయింపులతో పేదల పక్షాన నిలిచింది.
‘పాలమూరు’కు ఊపిరి..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వే గంగా జరుగుతున్నాయి. నార్లాపూర్, ఏదుల, వ ట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు, పంప్హౌస్లను నిర్మిస్తున్నారు. మొత్తం 18 ప్యాకేజీల్లో పనులన్నీ ఊపందుకున్నాయి. ఒక్కో రిజర్వాయర్, పంప్హౌస్ వద్ద వెయ్యి మంది సిబ్బంది 24 గంటలపాటు శ్రమిస్తున్నారు. వచ్చే వానకాలంలో పను లు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఆరు జిల్లాల పరిధిలో 12,30,000 ఎకరాల ఆయకట్టు సాగుకానున్నది. ఇప్పటివరకు దాదాపుగా రూ.11వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడంతో ప నులు త్వరగా పూర్తి చేసే అవకాశం ఏర్పడింది. రూ.960 కోట్ల కేటాయింపుతో పాలమూరుకు ప్ర భుత్వం ఊతమిచ్చిందని చెప్పొచ్చు. పల్లెలకు ఊపిరులూదేందుకు భారీగా నిధులు విడుదల చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.5 కోట్ల చొప్పున కేటాయిస్తూ వార్షిక ప ద్దులో రూ.800 కోట్లు లెక్కచూపించారు. స్థానిక సంస్థలకు సైతం రూ.500 కోట్లు కేటాయించారు. తొలిసారిగా జిల్లా, మండల పరిషత్లకు నిధులు కేటాయించడంపై ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు పెద్దపీట వేస్తూ రూ.29,271 కో ట్లు కేటాయించారు. ఈ సారి దళితుల కోసం ‘సీ ఎం దళిత్ ఎంపవర్మెంట్’ ప్రత్యేక పథకం ప్రకటించిన ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిం ది.
వ్యవసాయంలో ఆధునికతకు పెద్దపీట వేసిన సర్కారు వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు విడుదల చేసింది. రైతుబంధు, రైతుబీమాకు సైతం భారీగా నిధులు కేటాయించారు. మొత్తంగా జిల్లా నుంచి వ్యవసాయ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నిరంజన్రెడ్డి శాఖకు రూ.25 వేల కో ట్లు కేటాయించడం చూస్తే వ్యవసాయంపై రాష్ట్ర ప్ర భుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధ అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధులు భారీగా కేటాయించారు. గొర్రెల యూనిట్ల పంపిణీ కోసం ప్ర భుత్వం నిధులు కేటాయించి గొల్ల కురుమలకు అండగా నిలిచింది. నేతన్నల సంక్షేమానికి రూ. 338 కోట్లు కేటాయించింది. ఎంబీసీ నిర్మాణాలకు సొంత స్థలాలు కలిగిన వారికి కూడా అవకాశం క ల్పించేలా నిధులు ప్రవేశపెట్టారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసింది. ఆర్టీసీని ఆదుకునేందుకు ఈ ఏడాది రూ.3 వేల కోట్లు కేటాయించడమే కాకుండా బడ్జెట్ ద్వారా రూ. 1500 కోట్లు, బడ్జెటేతర రూపంలో మరో రూ. 1500 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. దీం తో ఆర్టీసీ కార్మికులు సంబురాలు చేసుకున్నారు. సాంస్కృతిక, పర్యాటక రంగాలకు రూ.726 కోట్లు కేటాయించారు. దీంతో ఇదే శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ఉమ్మడి పాలమూరులో పర్యాటకంపై ప్రత్యేక శ్రద్ధ వహించే అవకాశం ఏర్పడన్నుది.