ముంబై: దేశంలో కరోనా విలయతాండం చేస్తున్నది. దీంతో వైరస్ సోకినవారు భారీగా దవాఖానల్లో చేరుకున్నారు. దీంతో హాస్పిటళ్లలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్నది. ప్రాణవాయువు అందక మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. మహమ్మారి బారినపడి దవాఖానలో చేరితే.. ఆక్సిజన్ లేమితో మృత్యుఒడికి చేరుతున్నారు. రెండు రోజుల కిందట నాసిక్లో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 20 మంది రోగులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలోని థానే ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. థానేలోని వేదాంత్ దవాఖానలో ఆక్సిజన్ కొరతతో ఆరుగురు కరోనా రోగులు కన్నుమూశారు. దీంతో దవాఖానలో ఉన్న రోగులను ఇతర హాస్పిటళ్లకు తరలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..