న్యూఢిల్లీ: దేశ రాజధానిలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగాలకు చెందనివారు రాత్రి 10 గంటలలోపే తమ ప్రయాణాలను ముగించుకోవాలని ఢిల్లీ మెట్రో అధికారులు సూచించారు. ఏప్రిల్ 30వతేదీ వరకు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ప్రయాణాలను రాత్రి 10 గంటలకు ముందుగానే ముగించుకోవాలని కోరారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అత్యవసర సర్వీసులకు చెందిన వారిని రాత్రి 10 గంటల తర్వాత కూడా ప్రయాణించేందుకు అనుమతిస్తామని, అయితే వారు తమ గుర్తింపుకార్డులను చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అదిధింగా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్సు టెర్మినళ్లకు వెళ్లేవారికి, గర్భిణులు, రోగులు, రాయబార కార్యాలయాల ఉద్యోగులు ప్రయాణించవచ్చని అధికారులు చెప్పారు. ఆరోగ్యశాఖ, పోలీసు, జైళ్లు, హోంగార్డులను, సివిల్ డిఫెన్స్ వంటి అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయించినట్లు అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..