యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తొలిసారి పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లైగర్ అనే పేరు ఫిక్స్ చేశారు. కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించగా, ఈ డేట్కి రిలీజ్ కావడం కష్టమే అంటున్నారు. కరోనా వలన మూవీ కొన్ని నెలల వాయిదా పడిన సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండ లైగర్ ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది విజయ్ అభిమానులనే కాక సినీ ప్రేక్షకులని సైతం ఎంతగానో అలరించింది. ఈ పోస్టర్ ఇప్పుడు సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో అత్యధిక లైక్లు రాబట్టుకుని దక్షిణాది చిత్రాల్లో తొలి ఫస్ట్లుక్ పోస్టర్గా నిలిచింది. ఈ ఫస్ట్లుక్ పోస్టర్ ఇన్స్టాగ్రామ్లో దాదాపు 2 మిలియన్లకు పైగా లైక్స్ను సాధించి రికార్డు సృష్టించింది. చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే కథానాయికగా నటించగా, పలువురు బాలీవుడ్ స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.