హైదరాబాద్ : రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఏ మాత్రం ఆందోళన చెందొద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు, కొవిడ్ బాధితుల స్థితిగతులను తెలుసుకునేందుకు గురువారం మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో చేతులెత్తేసినందున దేశంలోని ఏ రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్నారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ ఆదేశంతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి కోరారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు.
కరోనా బాధితులు ధ్యైర్యంగా ఉండాలని మంత్రి తెలిపారు. వారు త్వరగా కోలుకోవడానికి, ఇమ్యూనిటీ పెంపొందించుకునేందుకు డ్రై ఫ్రూట్ కిట్స్ పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. కరోనా కిట్స్ బాధితులకు తాము ఉచితంగా అందజేస్తామని ఆయన తెలిపారు.
ఆక్సిజన్, మందుల కొరత లేదన్నారు.టెలీ కాన్ఫరెన్స్లో నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ
జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు : మంత్రి అల్లోల