న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులు వైరల్ జ్వరం బారిన పడుతున్నారు. గీతా కాలనీలోని చాచా నెహ్రూ ఆసుపత్రిలో పలువురు పిల్లలు అడ్మిట్ అయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పిల్లల రోగుల సంఖ్య పెరుగుతున్నదని ఆసుపత్రి అధికారిణి డాక్టర్ మమత జాజు తెలిపారు. 3-4 రోజులలో జ్వరం స్థిరపడుతుందని చెప్పారు. అయితే కొంత మంది పిల్లల పరిస్థితి సీరియస్గా ఉందని, ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఆసుపత్రిలో డెంగ్యూ కేసులు పెద్దగా లేవని డాక్టర్ మమత వెల్లడించారు.