హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉండగా ఇటీవల కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన హోంగార్డు రమేష్ను డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సాయంత్రం ఎల్బీనగర్ కామినేని దవాఖానకు చేరుకున్న ఆయన రమేష్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రమేష్కు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రమేష్ కుటుంబసభ్యులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. అన్నివిధాలా అండగా ఉంటామని డీజీపీ భరోసా ఇచ్చారు. ఎల్బీనగర్ ట్రాఫిస్ పోలీస్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న రమేష్ మంగళవారం స్టేషన్ ఎదుట నుంచి అతివేగంగా వెళ్తున్న ఓ కారును ఆపబోయి ఆ వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. డీజీపీ వెంట రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, ఏసీపీ శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.