జగిత్యాల టౌన్/కోనరావుపేట, మార్చి 19 : పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. జగిత్యాల జిల్లా భవానీనగర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 17 మంది విద్యార్థులకు, ఐదుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణైనట్లు జిల్లా వైద్యాధికారి శ్రీధర్ తెలిపారు. పాఠశాలకు శుక్రవారం 232 మంది హాజరు కాగా, వీరిలో కొందరికి దగ్గు, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన ప్రిన్సిపాల్ ప్రేమలత జిల్లా వైద్యాధికారి శ్రీధర్కు సమాచారం అందించారు. 31 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 17 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులకు పాజిటివ్ వచ్చింది. వీరికి అదే హాస్టల్లో ఐసొలేషన్ రూమ్ ఏర్పాటు చేశారు.
కస్తూర్బాలో 15మందికి పాజిటివ్
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కసూర్బా విద్యాలయంలో మొత్తం 62మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 15మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి మోహన్కృష్ణ తెలిపారు. ఇద్దరు విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసి క్యాంప్ నిర్వహించామని, పాజిటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు, ఎంఈవో రఘపతి పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో శానిటైజ్ చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ కృష్ణభాస్కర్ దృష్టికి తీసుకువెళ్లగా పాఠశాలకు మూడు రోజులు సెలవు ప్రకటించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.