న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.102 పెరిగి రూ.48,025కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,127 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ స్వల్పంగా తగ్గడమే దేశీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.269 పెరిగి రూ.70,810కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర 71,079 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,882 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 27.83 అమెరికన్ డాలర్లు పలికింది.