న్యూఢిల్లీ: ‘ట్విట్టర్’కు భారత్లో ప్రత్యామ్నాయంగా భావిస్తున్న మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ‘కూ’ భారీగా నిధులు సమీకరిస్తున్నది. సిరీస్ బీ ఫండింగ్లో భాగంగా ఇప్పటివరకు మూడు కోట్ల డాలర్ల నిధులను సేకరించింది. కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్కు మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ‘కూ’కు భారీగా నిధులు రావడం గమనార్హం.
‘కూ’ లో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో టైగర్ గ్లోబల్ ముందు వరుసలో నిలిచింది. యాక్సెల్ పార్టనర్స్, కలారీ క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్, డ్రీమ్ ఇంక్యూబేటర్ తదితర సంస్థలు తర్వాతీ జాబితాలో ఉన్నాయి.
ఇంకా ఐఐఎఫ్ఎల్, మేరీ అసెట్స్ సంస్థలు ఈసారి కొత్త ఇన్వెస్టర్ల జాబితాలో చేరాయి. కొత్త పెట్టుబడుల రాకతో కూ విలువ 100 మిలియన్ డాలర్లను దాటింది. ఫిబ్రవరిలో ‘కూ’లో పెట్టుబడుల విలువ 25 మిలియన్ డాలర్లని నిర్దారించారు.
తాజాగా సేకరించిన పెట్టుబడులతో కంపెనీని టెక్నాలజీ పరంగాగా పటిష్ట పరుస్తామని ‘కూ’ వెల్లడించింది. దేశీయ భాషల్లో మరింత బలపర్చేందుకు వినియోగిస్తామని పేర్కొంది.
‘భవిష్యత్లో ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజంగా ఎదిగేందుకు వేగంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ కల సాకారం దిశగా టైగర్ గ్లోబల్ సంస్థతో జత కట్టడం కీలక ముందడుగు’ అని కంపెనీ కో ఫౌండర్ కం సీఈవో అప్రమేయ రాధాకృష్ణ అన్నారు.
కొత్త ఐటీ నిబంధనలతో పౌరుల ప్రైవసీ ఉల్లంఘనే: వాట్సాప్
జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా
Flipkart Shop From Home Days sale: ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్
మొదటి డోసు కోవిషీల్డ్.. రెండోసారి కోవాగ్జిన్
జూన్ 1 నుంచి అలిపిరి నడక మార్గం మూసివేత
యాస్తో 3 లక్షల ఇండ్లకు నష్టం : మమతా బెనర్జీ
ఉత్తరాది ఓటర్లపై డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
చిన్న పరిశ్రమలకు త్వరలో ఉద్దీపన ప్యాకేజీ
బంగారం కొనుగోలుదారులకు ఊరట.. ఎందుకంటే?!
బంగారం బుల్ రంకె.. నెలలోనే 7% పైపైకి?!
ఆటో కంపెనీల వారంటీ, ఫ్రీ సర్వీస్ పీరియడ్ పొడిగింపు!
గల్వాన్ సరిహద్దు ఘర్షణ వేళ.. డ్రాగన్కు ఆ ఎగుమతులు రెట్టింపు!!
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!
200 కోట్ల డోస్ల ఉత్పత్తికి వాక్హార్డ్ రెడీ.. కానీ?!