ఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో తల్లడిల్లిన దేశ రాజధాని ఢిల్లీ మహమ్మారి నుంచి తేరుకుంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టగా తాజాగా ఢిల్లీలో కేవలం ఈ ఏడాదిలో అత్యంత కనిష్టంగా 89 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు అత్యల్పంగా 0.17 శాతానికి పడిపోయింది.
ఇక మహమ్మారి బారినపడి గత 24 గంటల్లో 11 మంది మరణించారు. ఈ ఏడాది జనవరి నుంచి తాజా పాజిటివ్ కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకోవడం ఇది రెండోసారి. తాజా కేసులతో ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 14,32,381కి చేరగా మరణాల సంఖ్య 24,925కి ఎగబాకింది. ఢిల్లీలో కరోనా వైరస్ నుంచి కోలుకునే రోగుల సంఖ్య పెరగడంతో రికవరీ రేటు గరిష్టంగా 98.12 శాతానికి పెరిగింది.