న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ తో విరుచుకుపడవచ్చనే అంచనాల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం పలు ముందస్తు చర్యలు చేపడుతోంది. థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపవచ్చనే కోణంలో పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు సహా పలు జాగ్రత్తలు తీసుకున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు. కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు.
థర్డ్ వేవ్ ముమ్మర దశలో 37,000 కేసులు వెలుగుచూడవచ్చనే అంచనాతో ఏర్పాట్లు చేపడతామని అన్నారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లల కోసం ఎన్ని పడకలు కేటాయించాలి..వారి కోసం మందులు, ఆక్సిజన్, మాస్కులు సేకరణ వంటి అంశాలపై సూచనలు అందించేందుకు పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ కసరత్తు సాగిస్తుందని చెప్పారు. నూతన కొవిడ్-19 వేరియంట్లను గుర్తించేందుకు రెండు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.