న్యూఢిల్లీ: రైతుల ఉద్యమం నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పోలీసులు ఎవరినైనా ఈ చట్టం కింద అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. ఢిల్లీ పోలీసు కమిషనర్ శ్రీవాస్తవకు విశేష అధికారాలు కల్పించే ఈ ఉత్తర్వులు జూలై 19 నుంచి అక్టోబరు 18 వరకు అమలులో ఉంటాయి. జాతీయ పర్వదినాల సందర్భంగా ఇలాంటి ఉత్తర్వులు మామూలేనని, స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్నందున వీటిని జారీ చేశారని అధికారులు అంటున్నారు.