నారాయణపేట, ఏప్రిల్ 27: రైతులు, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్త్తూ దేశంలో ఇతర రాష్ర్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని పలువురు నాయకులు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్ల పూర్తయ్యాయి 21వ ఏండ్లలో అడుగు పెడుతున్న సందర్భంగా మంగళవారం పట్టణంలోని గాంధీనగర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవిడ్ నిబంధనలు అనుసరించి సంబరాలు జరుపుకొన్నారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కోట్ల రాజవర్ధ్దన్రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కన్నా జగదీశ్, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి విజయ్సాగర్, టీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు నారాయణమ్మ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరికల్లో..
మరికల్, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం మండలంలో ఘనంగా జరుపుకొన్నారు. జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గౌని సురేఖారెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ గోవర్ధన్, మండల సింగిల్విండో చైర్మన్ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపత య్య మాట్లాడుతూ ఉద్యమ పార్టీగా ఆవిర్భావించిన టీఆర్ఎస్ పార్టీ నేడు రైతుల పార్టీగా మారిందన్నారు.గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జెండాను ఎగురవేసి అనంతరం కార్యకర్తలకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే జిన్నారంలో పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జిన్నారం సర్పంచ్ భాస్కర్, నాయకులు పాల్గొన్నారు.
ఊట్కూర్లో..
ఊట్కూర్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల వ్యాప్తంగా మంగళవారం పార్టీ నాయకులు ఘనంగా జరుపుకొన్నారు. ఆలయాల్లో పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు మిఠాయి పంపిణీ చేశారు. ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగిందన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు సూర్యప్రకాశ్రెడ్డి, మాణిక్యమ్మ, సుమంగళి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
మాగనూర్లో..
మండలంలోని వివిధ గ్రామాల్లో నాయకులు పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. జెడ్పీటీసీ వెంకటయ్య, సింగిల్విండో చైర్మన్ వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోన్రెడ్డి కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, పట్టణ అధ్యక్షుడు రాంగోపాల్శెట్టి, మార్కెట్ డైరెక్టర్ శ్రీనివాసులు, ఈశ్వర్యాదవ్ పాల్గొన్నారు.
మక్తల్లో..
మక్తల్ టౌన్, ఏప్రిల్ 27 : రాష్ట్రం పునాది తెలంగాణ రాష్ట్ర సమితిదే అని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. మంగళవారం మంథన్గోడ్లో తన నివాసంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని ప్రజలు సొంత పార్టీగా భావిస్తున్నారన్నారు. పట్టణం లోని ఎరుకలి గేరిలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇండ్లపై జెండాను ఆవిష్కరించారన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేరెడుగోంలో..
మక్తల్ టౌన్, ఏప్రిల్ 27: తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మాగనూర్ మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి, జెడ్పీటీసీ వెంకటయ్య అన్నారు. మాగనూర్ మండలంతోపాటు నేరడగోంలో మంగళవారం టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నరసింహ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. తెలంగాణ యాసను, భాషను, సంస్కృతిని ఉద్యమంలో భాగంగా చేసి తెలంగాణ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మాగనూర్ టీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో ..
కృష్ణ, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి మాగనూర్, కృష్ణ మండల కేంద్రాలతోపాటు ముడుమాల, మురహరిదొడ్డి, చేగుంట, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు విజయపాటిల్, ఎల్లారెడ్డి, ఎంపీపీ పూర్ణిమపాటిల్, శ్యామల, జెడ్పీటీసీ అంజనమ్మపాటిల్, వెంటయ్యతోపాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివప్ప, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మోనేష్, యువ నాయకులు, రైతుబంధు సమితి మండలాధ్యక్షలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తులు పాల్గొన్నారు.
నారాయణపేటలో..
నారాయణపేట రూరల్, ఏప్రిల్ 27 : మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. కోటకొండ పార్టీ కార్యాలయంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వెంకట్రాములుగౌడ్ జెండాను ఆవిష్కరించారు. మాజీ మండలాధ్యక్షుడు రాములు, నాయకులు పాల్గొన్నారు. సింగారంలో మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, బొమ్మన్పాడ్లో వైస్ ఎంపీపీ సుగుణ భగవంతు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు హన్మంతు పాల్గొన్నారు.
కోస్గిలో..
కోస్గి, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు మండలంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీలోని శివాజీ చౌరస్తాలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మంత్రెడ్డి జెండాను ఎగురవేశారు. గుండుమల్లో ఎంపీపీ మధుకర్రావు, సంపల్లిలో టీఆర్ఎస్ నాయకులు జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధన్వాడలో..
ధన్వాడ, ఏప్రిల్ 27: ధన్వాడ, కిష్టాపూర్, ఎంనోన్పల్లి గ్రామాల్లో మంగళవారం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకొన్నారు. ఎంనోన్పల్లిలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు వడ్ల ధాన్యం కుప్పలోనే పార్టీ జెండాను ఆవిష్కరించారు. వడ్లతోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటూ వినూత్నంగా రాశారు. ఇది చూపురులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచులు, మాజీ ఎంపీటీసీ బాలరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.