అచ్చంపేట, జూన్ 27 : గ్రామాలు, పల్లెలను అభివృద్ధి పర్చేందుకు కావాల్సి న నిధులను ప్రభుత్వం వెచ్చించి అ మలు చేస్తుంటే క్షేత్రస్థాయిలో పనిచేసే అ ధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నీరుగారుతున్నది. అందుకు నిదర్శనమే ఉప్పునుంతల మండలంలోని తాడూర్ ప్రకృతివనం. గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఆనుకొని ప్రకృతి వనాన్ని పెద్దబండరాయిపై ఏర్పాటు చేశారు. బండరాయి తర్వాత మిగిలిన కొద్దిపాటి స్థలంలో వంతుకు మాత్రమే మొక్కలు నాటారు. గ్రామస్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా ప్రకృతివనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఈ పార్కు ఉన్నది. కేవలం ప్రకృతివనం అంటూ బోర్డు పెట్టి బండరాయి చుట్టూ ఫెన్సింగ్ వేసి కొన్ని మొక్కలు నాటి వదిలేశారు. నాటిన మొక్కల్లో కొన్ని ఎండిపోయాయి. ప్రకృతివనాన్ని రోడ్డు పక్కనే అందరికీ కనిపించేలా ఏర్పాటు చేశారు కానీ ఆసక్తికరంగా లేదు. భవిష్యత్ అవసరాల కోసం ప్రకృతివనం ఏర్పాటుకు నిధులు వెచ్చించి నిర్వహణకు ప్రతినెలా డబ్బులు అందజేస్తున్నా క్షేత్రస్థాయిలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం కారణంగా ఆచరణలో కనిపించడం లేదు.
డంపింగ్యార్డు, శ్మశానవాటిక, పల్లెప్రకృతివనాలు, హరితహారంపై ప్రభుత్వం సీరియస్గా పనిచేస్తున్నది. ప్రతినెలా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా సీ ఎం కేసీఆర్ గ్రామ పంచాయతీల బలోపేతం కో సం ముందుస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నా రు. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను అప్రమ త్తం చేస్తున్నా ప్రభుత్వ ఆదేశాలు అమలు కావడం లేదు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సా గడం లేదు. తాడూర్లోని పల్లె ప్రకృతివనంలో చె ట్లకు నీళ్లు లేక ఎండిపోయాయి. పర్యవేక్షణ చేసే అధికారులు ఏమి చేస్తున్నట్లు? ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జా రీచేసినా, సర్పంచులు, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటున్నా మార్పు రాకపోవడం విడ్డూరం. తాడూర్లో ప్రకృతి వనం ఎందుకు ఏర్పాటు చే శారో అధికారులకే తెలియాలి. జిల్లా అధికారులు ప్రకృతివనాన్ని తనిఖీ చేయాల్సిన అవసరం ఉ న్నది. ఎంపీడీవో లక్ష్మణ్రావును వివరణ కోరేందు కు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
పల్లె ప్రకృతివనాన్ని తనిఖీ చేస్తా..
తాడూర్ పల్లె ప్రకృతివనాన్ని పరిశీలిస్తా. ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేస్తోంది. పల్లెప్రకృతివనంలో అన్ని రకాల మొక్కలు నాటాలి. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి. . చుట్టు ఫెన్సింగ్ చేయాలి. ఎంపీవోలు వీటిపై పర్యవేక్షణ చేయాలి. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి బాధ్యత తీసుకొని పనిచేయాలి. నిర్లక్ష్యం వహించే వారిపై కలెక్టర్ ఇటీవలే చర్యలు తీసుకున్నారు. ప్రతి మండలంలో పదెకరాల్లో బృహత్ ప్రకృతి వనాన్ని పెంచేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు భూమి సేకరిస్తున్నారు. నేను జిల్లాలో బాధ్యతలు చేపట్టి నెలరోజులు అవుతున్నది. తాడూర్ పల్లె ప్రకృతివనంపై దృష్టి పెట్టి బాగుచేయిస్తా.