Kashmiri Pandits Protest | దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కశ్మీరీ పండిట్లు శనివారం నిరసన ప్రదర్శన జరిపారు. కశ్మీర్ లోయలో మైనారిటీలైన కశ్మీరీ పండిట్లపై ఇటీవలి ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా ఈ నిరసన తెలిపారు. 1990 నుంచి కశ్మీరీ పండిట్ల మారణ హోమం సాగుతున్నదని, కానీ దాన్ని నిలువరించే వారు లేరని ఆందోళనకారులు వాపోతున్నారు. కశ్మీరీ పండిట్ల కోసం ప్రత్యేకంగా కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
కశ్మీర్ నుంచి పండిట్ల సామూహిక వలసలపై దర్యాప్తు చేయాలని.. మాకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నా ఇల్లు ఎక్కడ?, అమాయక పండిట్లను హత్యచేసిన వారికి కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లతోకూడిన ప్లకార్డులు చేబూని నిరసన తెలిపారు.