న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రోజూ వేల మందిని పొట్టన పెట్టుకుంటున్నది. చిన్నాపెద్దా, బీదాబిక్కీ అన్న భేదమేమీ లేకుండా అందరినీ బలి తీసుకుంటున్నది. తాజాగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తండ్రి కూడా కరోనా కాటుకు బలయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మన ఆరోగ్యమంత్రి తండ్రి ఇవాళ కరోనాతో మరణించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. సత్యేందర్ జైన్ ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. జైన్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని అరవింద్ కే్జ్రివాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు.