న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. నగరంలోని పాండవ్నగర్ పోలీస్స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాహుల్సింగ్ (31) తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదని, ఎస్ఐ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఢిల్లీ ఈస్ట్ విభాగం డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రియాంకా కశ్యప్ చెప్పారు.
ఆత్మహత్యకు పాల్పడిన ఎస్ఐ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాకు చెందిన వాడని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని చెప్పారు.