న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీలో మరిన్ని కరోనా టీకా కేంద్రాల ఏర్పాటు, టీకా వేయించుకునే ప్రజల వయసులో సడలింపు ఇవ్వాలని కోరారు. వయసు నిబంధన లేకుండా ప్రజలంతా కరోనా టీకా పొందే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మరిన్ని వ్యాక్సిన్ కేంద్రాల ఏర్పాటు, అన్ని వయసుల వారికి టీకా తీసుకునే వెసులుబాటు పరిస్థితులు ఉంటే ఢిల్లీలోని పౌరలందరికీ మూడు నెలల్లో కరోనా టీకాలు వేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. దీనికి అనుమతి ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధాని మోదీని సీఎం కేజ్రీవాల్ తన లేఖలో కోరారు.
మరోవైపు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ర్యాండమ్ టెస్టింగ్ను వేగవంతం చేసినట్లు ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ప్రతి రోజు 80 వేలకుపైగా కరోనా పరీక్షలు చేస్తున్నామని, ఆదివారం 86,899 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పారు. జాతీయ సగటు కన్నా ఢిల్లీలో ఐదు రెడ్లు ఎక్కువగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.