ఈ స్ఫూర్తితో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ముందుకు సాగాలి
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సన్మానం
తిమ్మాపూర్, ఏప్రిల్ 12 : తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామపంచాయతీకి జాతీయ స్థాయి దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారం రావడం జిల్లాకు గర్వకారణమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పర్లపల్లి గ్రామ సర్పంచ్ మాదాడి భారతీ నర్సింహారెడ్డి, పాలకవర్గాన్ని మంత్రి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులంతా పోటీతత్వంతో పని చేసి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. జిల్లాకు ప్రతి సంవత్సరం కనీసం 4-5 జాతీయ అవార్డులు వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు. పర్లపల్లి గ్రామం సాధించిన జాతీయ అవార్డును స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్, తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఎంపీటీసీ ముప్పిడి సంపత్రెడ్డి, ఉప సర్పంచ్ సుద్దాల రాజేశ్, కరీంనగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ర్యావ రాజు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు సూరం మహేందర్రెడ్డి, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సమాజంలో వివక్ష ఏ రూపంలో ఉన్నా పారద్రోలాలి: వెంకయ్యనాయుడు
సమాజంలో వివక్ష ఏ రూపంలో ఉన్నా పారద్రోలాలి: వెంకయ్యనాయుడు