న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ షెల్టర్ హోమ్స్లో ఆశ్రయం పొందే పేదలకు ఉచిత ఆహార కార్యక్రమాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా సరాయ్ కాలే ఖాన్ వద్ద షెల్టర్ హోమ్ కాంప్లెక్స్లోని వారికి ఆహారాన్ని స్వయంగా వడ్డించారు. ఢిల్లీలోని 209 ప్రభుత్వ షెల్టర్ హోమ్స్లో ఆశ్రయం పొందే పేదలకు ఈ కార్యక్రమం కింద ఉచితంగా ఆహారాన్ని అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం సుమరు 6 వేల మందికి ఆహారం అందిస్తున్నామని, శీతాకాలంలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని చెప్పారు.
షెల్టర్ హోమ్లో ఉండే వారు అత్యంత పేదలని, ఓటు బ్యాంక్ కాని వీరిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని కేజ్రీవాల్ విమర్శించారు. తమది బాధ్యత కలిగిన ప్రభుత్వమని, అందుకే పేదల కోసం చాలా చేసినట్లు ఆయన చెప్పారు. పేదల ఆకలి తీర్చడమే నిజమైన ధర్మమని కేజ్రీవాల్ అన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్తో కలిసి ఢిల్లీలోని అన్ని ఆశ్రయ గృహాలలో ఉచితంగా వండిన భోజనాన్ని శాశ్వతంగా పంపిణీ చేసే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.