న్యూఢిల్లీ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించడంతో పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ను ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఫలవంతమైన పాలన సాగించాలని ఆకాంక్షిస్తున్నానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఇక తమిళనాట మొత్తం 234 స్ధానాలకు గాను డీఎంకే 148 స్ధానాల్లో, ఏఐఏడీఎంకే 85 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా ఎంఎన్ఎం ఒక స్ధానంలో ఆధిక్యం కనబరుస్తోంది.