న్యూఢిల్లీ: మెడిటేషన్, యోగా సైన్సెస్ డిప్లొమో కోర్సును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రారంభించారు. ఏడాది డిప్లొమో కోర్సుకు సుమారు 450 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. అక్టోబర్ 1 నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బోధకులు ఈ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇస్తారని కేజ్రీవాల్ వెల్లడించారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో మెడిటేషన్, యోగా సైన్సెస్ డిప్లొమో కోర్సును ఆయన ప్రారంభించారు.