ముథోల్, ఏప్రిల్ 14: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం కారేగాంలో 45 ఏండ్లు దాటినవారంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో 272 కుటుంబాలు, 1,001 మంది జనాభా ఉన్నది. వీరిలో 250 మందికి 45 ఏండ్లు నిండినట్టు గుర్తించిన సర్పంచ్ కీర్తన్రెడ్డి, యువకులు, వైద్యసిబ్బంది.. వారికి వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ముథోల్ సీహెచ్సీలో విడతలవారీగా టీకా వేయించారు. అర్హులైనవారు అందరూ టీకా తీసుకొని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు.