పుణె, మార్చి 14: తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిల్లో బీజేపీ ఓడిపోతుందని, అసోంలో మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన పుణెలో విలేకరులతో మాట్లాడుతూ ‘అత్యంత ఉత్కంఠంగా సాగుతున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. బీజేపీ ఎన్ని ఎత్తులువేసినా మమతాబెనర్జీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం’ అని తెలిపారు.