న్యూఢిల్లీ, మే 29: దేశంలో సెకండ్ వేవ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన రెండు రోజుల్లు రోజువారీ కేసులు 2 లక్షల కంటే తక్కువ నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు (కరోనా టెస్టుల్లో పాజిటివ్లుగా తేలే వారి సంఖ్య) కూడా పడిపోవడం ఊరట కలిగిస్తున్నది. శుక్రవారం 20,80,048 పరీక్షలు నిర్వహించగా 1,73,790 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 8.36 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో 3,617 మంది మరణించారు. ఇప్పటివరకు 20.89 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. అమెరికా తర్వాత 20 కోట్ల డోసులు వేసిన రెండో దేశం ఇండియానే అని కేంద్రం తెలిపింది.