న్యూఢిల్లీ, మే 3: దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం ఒక్కరోజులోనే 4 లక్షలకుపైగా కేసులు నమోదుకాగా.. తాజాగా ఆదివారం నుంచి సోమవారానికి 24 గంటల్లో 3,68,147 కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 1,99,25,604కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 1,62,93,003 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 34,13,642 మంది చికిత్స పొందుతున్నారు.